అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ

నల్లగొండ,మార్చి2(జ‌నంసాక్షి): నల్గోండ జిల్లాలోని ఆత్మకూరు.ఎస్‌ మండలం పెన్‌పహాడ్‌  గ్రామమం  అంగన్‌ వాడి కేంద్రాన్ని రోడ్లు భవనాలు ,స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల అకస్మిక తనిఖీ చేశారు.  కేంద్రంలో 25 మంది విద్యార్దులు నమోదుకాగా 18 మంది హాజరుగా చూపించడమైనది, వాస్తవానికి 11 మంది విద్యార్ధులు మాత్రమే ఉన్నారు.  ఈ విషయమై అంగన్‌ వాడి టీచరును వివరాలు తెలునుకొని మందలించడమైనది.  కేంద్రంలో ఆరోగ్య లక్ష్మీ పధకం ద్వారా గర్బీణీలకు పంపిణీ చేయవలసిన భోజనం, గుడ్డు, పాలు అందనందున, గత మూడు రోజులుగా పంపిణీ చేయలేదని అంగన్‌ వాడీ టీచరు తెలుపగా, మంత్రి జిల్లా అధికారులను అంగన్‌ వాడీ కేంద్రాలకు కావలసిన సరుకులు తక్షణం అందేలా చూడాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా మంత్రి ఇలాంటి పోరపాట్లు భవిష్యత్తులో జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించడమైనది.