అంగరంగ వైభవంగా దుర్గామాత ఉత్సవాలు

గరిడేపల్లి, సెప్టెంబర్ 26 (జనం సాక్షి): మండల కేంద్రంలోని రామాలయం మారుతి నగర్ ఎస్సీ కాలనీ వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 5 తేదీ బుధవారం వరకు విశేష దివ్యాలంకరములు అభిషేకములు కుంకుమ పూజలు అత్యంత వైభవముగా నిర్వహించబడునని  తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు భక్తులు మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.