అంజన్న ఆలయ ఆదాయం 19.72 లక్షలు..

అంజన్న ఆలయ ఆదాయం 19.72 లక్షలు..
ఊరుకొండ, డిసెంబర్ 1 (జనంసాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ హుండీ ఆదాయం 19.82 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ
శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంజన్న ఆలయంలో శుక్రవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో దేవాలయ ఇన్ స్పెక్టర్ వీణాదరి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ అధ్యక్షతన హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ లెక్కింపులో 19 లక్షల 82వేల 594 రూపాయలు వచ్చినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, ద్వారక సేవాదళం సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.