అంజయ్యకు నివాళులర్పించిన గద్దర్‌

ఆదిలాబాద్‌: అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ ప్రజాకవి గూడ అంజయ్యకు ప్రజా గాయకుడు గద్దర్‌ నివాళులర్పించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని రాగన్నగూడెంలోఅంజయ్య కన్నుమూసిన సంగతి. ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామమైన ఆదిలాబాద్‌ జిల్లా లింగాపూర్‌ తరలించారు. ఈరోజు లింగాపూర్‌ చేరుకున్న గద్దర్‌ అంజయ్య పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అంజయ్య ఆశయాలను కొనసాగిద్దామంటూ అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు.