అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్

 

 

 

 

 

సంగారెడ్డి : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో మ‌హిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్‌ను కేటీఆర్ ఆవిష్క‌రించారు. 50 ఎక‌రాల్లో ఈ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా  ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో) పార్క్‌లో మహిళా పారిశ్రామిక వేత్తలతో సమావేశమ‌య్యారు.