అందరూ కలిస్తేనే హోదా సాధ్యం: చలసాని

అమరావతి,మే23(హో):  ప్రత్యేక ¬దా సాధన కోసం రాజకీయ పార్టీలన్నీ ఒకటి కావాలని హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. రాజకీయ పార్టీలు ఎవరికివారే అన్నట్లు వ్యవహరించటం వల్లే ¬దా రావటంలేదన్నారు. గుంటూరు అరండల్‌పేటలో జరిగిన ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోదా సాధన సమితి ఆందోళన ప్రారంభించిన రోజే సీఎం చంద్రబాబు ధర్మాపోరాట దీక్ష చేయటం సబబుకాదని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి బుద్ధి చెప్పాయని.. ఈ పరిస్థితుల్లోనే కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అన్నారు. ఆంధ్రుల భవిష్యత్తుకోసమే దీక్షలు కొనసాగిస్తున్నామని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు