అంధుల కోసం శ్రీవారి దర్శనం

హైదరాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): తిరుమలలో వెంకన్న దర్శనం చేసుకోవాలనుకునే అంధుల కోసం శ్రీ అష్టోత్తర శత 108 చారిటబుల్‌ ట్రస్ట్‌ అవకావం కల్పిస్తోంది. వచ్చే యేడాది మే 1వ తేదీ లేదా 5వ తేదీన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తోంది. ఈ మేరకు తమ ట్రస్ట్‌ ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ట్రస్టు చైర్మన్‌. డాక్టర్‌ వేణుకుమార్‌ చుక్కల తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించి పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎంపిక చేసుకున్న వారికి రానుపోను చార్జీలు, భోజనం, వసతి, దర్శనం అన్ని ఉచితంగా అందించి దర్శనం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు మేనేజర్‌ వసంతకుమార్‌ను 9666159999 సంప్రదించాలని తెలిపారు.