అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు

రాష్టాల్రను బట్టి 21 రోజులపాటు సెలవుదినాలు
యా పండగల కారణంగా వివరాలు ప్రకటించిన ఆర్‌బిఐ
ముంబై,సెప్టెంబర్‌25 (జనంసాక్షి); దసరా,దీపావళిలతో పాటు వరుసగా వచ్చే వివిధ రకాల సెలవులతో అక్టోబర్‌లో బ్యాంకుల పనిదినాలు తగ్గనున్నాయి. వర్కింగ్‌ డేస్‌ తగ్గడంతో పాటు సెలవులు పెరగనున్నాయి. ఈ మేరకు ఆర్‌బిఐ ఓ ప్రకటన చేసింది. అక్టోబరు నెలలో మహాత్మాగాంధీ జయంతి,దుర్గా పూజ,విజయ దశమిల సందర్భంగా దేశంలోని బ్యాంకులకు 21 రోజుల పాటు సెలవులను భారత రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించింది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్టాల్రు ప్రాంతాల వారీగా 21 రోజుల పాటు వేర్వేరు రోజుల్లో సెలవులు ఇచ్చారు. రిజర్వ్‌ బ్యాంకు నిబంధనల ప్రకారం అక్టోబరు నెలలో 14 రోజులపాటు సెలవులున్నాయి. దీంతో పాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి ఏడు వారాంతపు సెలవులున్నాయి. అక్టోబరు 1వతేదీన బ్యాంకుల అకౌంట్స్‌ క్లోజింగ్‌ కాబట్టి గ్యాంగ్‌ టక్‌ లో మొదటి సెలవు. అక్టోబరు 2వతేదీన గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబరు 15వతేదీన దుర్గా పూజ సందర్భంగా సెలవు దినం. అక్టోబరు 3వతేదీన ఆదివారం సెలవు. అక్టోబరు 6వతేదీన మహాలయ అమావాస్య సందర్భంగా అగర్తలా, బెంగళూరు, కోల్‌ కతాలలో బ్యాంకులను మూసివేయనున్నారు. అక్టోబరు 7వతేదీన ఇంఫాల్‌ లో బ్యాంకులు పనిచేయవు. అక్టోబరు 9వతేదీ రెండో శనివారం సందర్భంగా సెలవు. అక్టోబరు 10 ఆదివారం సెలవు. అక్టోబరు 12 వతేదీ అగర్తలా, కోల్‌కతాలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అక్టోబరు 13వతేదీన దుర్గాపూజ మహాఅష్టమి
సందర్భంగా అగర్తలా, భువనేశ్వర్‌, గ్యాంగ్‌ టక్‌, గౌహతి, ఇంఫాల్‌, కోల్‌ కతా, పాట్నా, రాంచీలలో బ్యాంకులు పనిచేయవు. అక్టోబరు 14వతేదీన దుర్గాపూజ మహానవమి సందర్భంగా అగర్తలా, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌ టక్‌, గౌహతి, కాన్పూర్‌, కొచ్చి, కోల్‌ కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌, శ్రీనగర్‌, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అక్టోబరు 15న దసరా సందర్భంగా సిమ్లా,ఇంఫాల్‌ మినహా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. అక్టోబరు 16న గ్యాంగ్‌ టక్‌ లో పూజ సందర్భంగా సెలవు. అక్టోబరు 17వతేదీ ఆదివారం. అక్టోబరు 18న గౌహతిలో బ్యాంకులకు సెలవు. అక్టోబరు 19న మిలాదున్నబి సందర్భంగా అహ్మదాబాద్‌, బేలాపూర్‌, భోపాల్‌, చెన్నై, డెహ్రాడూన్‌, హైదరాబాద్‌, ఇంఫాల్‌, జమ్మూ, కాన్పూర్‌, కొచ్చి , లక్నో, ముంబై, నాగపూర్‌, న్యూఢల్లీి, రాయపూర్‌, రాంచీ, శ్రీనగర్‌, తిరువనంతపురంలలో బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్‌ 20వతేదీన మహర్షి వాల్మీకి పుట్టినరోజు,లక్ష్మీ పూజల సందర్భంగా అగర్తలా, బెంగళూరు, చండీగఢ్‌, కోల్‌కతా, సిమ్లాలలో బ్యాంకులు మూసివేయనున్నారు.శ్రీనగర్‌ లో అక్టోబరు 22న మిలాదున్నబి తర్వాత శుక్రవారం సెలవు ఇచ్చారు. అక్టోబరు 23వతేదీన నాల్గవ శనివారం, అక్టోబరు 24 న ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. బ్యాంకుల సెలవులను దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులు అసౌకర్యాన్ని నివారించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని రిజర్వు బ్యాంకు సూచించింది.