అక్రమంగా తరలిస్తున్నరేషన్‌ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి129ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో అక్రమ బియ్యం తరలింపుపై కన్నేసని పోలీసులు వాటిని స్వాధృనం చేసుకున్నారు.  జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.