అగర్వాల్‌ ఆస్పత్రి ఎండి అరెస్ట్‌

నెల్లూరు,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  నెల్లూరు జిల్లాలోని అగర్వాల్‌ ఆస్పత్రి ఎండీ శివప్రతాప్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం  ఉదయం ఆయన కారును నడిపిస్తూ బీభత్సం సృష్టించారు. కిమ్స్‌ ఆసుపత్రి సవిూపంలో ఆయన కారు పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన అగర్వాల్‌ హాస్పిటల్‌ ఎండీ శివప్రతాప్‌రెడ్డిని పోలీసులు  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.