అజాత శత్రువు వాజ్‌పేయి

– తెరాస ఎంపీ కె. కేశవరావు
న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అజాత శత్రువని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్నారనుకున్నారు కానీ, శత్రువులు ఉన్నారని ఆయన ఏనాడూ భావించలేదని కేకే అన్నారు. వాజ్‌పేయి గురించి చెప్పాలంటే హృదయం ద్రవించుకుపోతుందని అన్నారు. ఆయన మహానుభావుడని, అజాతశత్రువని కేకే కొనియాడారు. ఆయన ఎవరినీ ఎనీవిూగా చూడలేదని అన్నారు. ఆయన లేకపోవడం దేశానికి పెద్ద లోటని కేకే అన్నారు. వాజ్‌పేయి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లారని, ఆయన మొహంలో ఎప్పుడూ చిరునవ్వే ఉండేదని కేకే అన్నారు. ఆయన ఎవరికీ భాధ కలిగేవిధంగా మాట్లాడేవారుకాదని కేకే పేర్కొన్నారు.