అట్టహాసంగా తెలంగాణ అవతరణోత్సవాలు
చారిత్రక ప్రాంతాల వద్ద విద్యుద్దీపాలంకరణ
ఏర్పాటు ఘనంగా ఉండాలన్న సిఎస్ జోషి
అధికారులతో సవిూక్ష..తగు ఆదేశాలు
హైదరాబాద్,మే23( జనం సాక్షి): జూన్,2 న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పకడ్బందిగా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర అవతరణ ఉత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమన్యయ సమావేశం నిర్వహించారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మొదట గన్పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తారన్నారు. సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన వారికి అవార్డులను ప్రధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ రెగ్యులేషన్కు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని,వేడుకలు ముగిసాక వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లే విషయం ఆలోచించాలన్నారు. అలైటింగ్, పిక్అప్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమాచార శాఖ ద్వారా వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు, ఎల్ ఈడి టివి, పిఏ సిస్టం, కామెంటేటర్లు, విూడియా కవరేజి తదితర పనులు చేపట్టాలని సియస్ ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నగరంలో ప్రధాన ప్రాంతాలైన రాజ్ భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రాంతాలలో విద్యుద్ధీకరణ చేపట్టాలన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో పరిశుభ్రత, మొబైల్ టాయిలేట్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, అంబులెన్సులు, వైద్యనిపుణుల టీంలు, బారికేడింగ్, అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లు. పుష్పాలంకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వెయ్యి మంది విద్యార్ధులు పాల్గొంటారన్నారు. /ూష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో పీపుల్స్ ప్లాజాలో, తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ వంటకాలతో పీపుల్స్ ప్లాజా లో ఫుడ్ ఫెస్ట్ వల్ ను ఏర్పాటు చేయనున్నట్లు టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం సి.యస్ కు వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా, రాజీవ్ త్రివేది, సునీల్ శర్మ, శివశంకర్, జయేష్ రంజన్ కార్యదర్శులు బి.వెంకటేశం, బెన్ హర్ మహేశ్ దత్ ఎక్కా, హెచ్ ఎండిఏ కవిూషనర్ చిరంజీవులు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, అడిషనల్ డిజిపి తేజ్ దీప్ కౌర్ విూనన్, పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఫైర్ సర్వీసెస్ డిజి గోపి క్రిష్ణ, పోలీసు అధికారులు రాజీవ్ రతన్, జితేందర్, స్వాతి లక్రా, నార్త్ జోన్ డిసిపి సుమతి, ప్రొటొకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, విశాలాక్షి, సోనుబాలాదేవి, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లీ, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.