అడవిని ఆదివాసీలే కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు


` పోడు సమస్యలను పరిష్కరిస్తాం
` అటవీ భూములను రక్షిస్తాం
` అడవులను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు
` ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలు
హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి):పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. అడవి విూద ఆధారపడి బతికే అమాయకులైన గిరిజనులకు మేలు చేయడంతో పాటు అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి వాళ్ళ విూద కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అటవీ, పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆశించిన విధంగా పని చేస్తున్న జిల్లాల కలెక్టర్లు అటవీ భూముల రక్షణలోనూ కీలక భూమిక పోషించాలని సీఎం స్పష్టం చేశారు. అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ ` పునరుజ్జీవం, హరితహారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్‌, పంచాయతీ రాజ్‌ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ప్రగతిభవన్‌ లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే ఏం లాభమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను రక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలకు మేలు చేసిన వారమవుతామని సీఎం పేర్కొన్నారు. దట్టంగా ఉన్న అడవులను రక్షించుకోవడం, ఫారెస్ట్‌ భూములను గుర్తించి, వాటిని అడవులుగా పునరుజ్జీవింపజేయడం, ఆక్రమణలు లేకుండా చేయడం, ఉద్దేశపూర్వకంగా అడవులను నాశనం చేసే వారి విూద కఠిన చర్యలు తీసుకోవడం ప్రాధాన్యంగా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, బయటి నుండి వచ్చే శక్తులే అడవిని నాశనం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. గోండు, కోలం, కోయ వంటి గిరిజన తెగల అడవి బిడ్డలు అడవికి నష్టం చేయరన్నారు. బయటి నుండి వచ్చే శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలన్నారు. అడవులను కాపాడుకునే అమాయకులు ఎవరు ? అడవులను నాశనం చేయాలనుకునే వాళ్ళు ఎవరు అనేది గుర్తించడం ముఖ్యమన్నారు. ఫారెస్టు లోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సవిూపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయించాలని, ప్రభుత్వ భూములు లేని పక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయించి, వారికి నీరు, కరెంటు, నివాస సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఫారెస్టు భూములకు శాశ్వత బౌండరీలను ఫిక్స్‌ చేసి సరిహద్దులకు ప్రొటెక్షన్‌ ట్రెంచ్‌ ఏర్పాటు చేసి, ట్రెంచ్‌ పైన గచ్చకాయ ప్లాంటేషన్‌ చేపట్టాలన్నారు. ట్రెంచ్‌ ఏర్పాటు చేయడానికి అటవీ నిధులతో పాటు ఉపాధి హావిూ పథకం నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. సోషల్‌ ఫారెస్ట్‌ లో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా ఒక అడవితో సమానం కాదని సీఎం అన్నారు. ఒక పది ఎకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమన్నారు. గజ్వేల్‌ లో అడవుల పునరుజ్జీవం చేపట్టినట్లుగానే అన్ని జిల్లాల్లో అడవుల పునరుజ్జీవానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అడవి లేని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటవీ శాఖ భూముల్లో అడవులను అభివృద్ధి చేయాలన్నారు. ప్లలె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ప్లలె ప్రకృతి వనాల అభివృద్ధి మంచి ఆలోచన అని సీఎం అధికారులను అభినందించారు. సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతీ రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌ రావు , సెక్రటరీలు స్మితా సభర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, ఓఎస్డి ప్రియాంక వర్గీస్‌ , అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి , పీసీసీఎఫ్‌ శోభ , పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.