అద్దెకు ఉంటున్న బాలికపై అత్యాచారం
హైదరాబాద్,జనవరి7(జనంసాక్షి): పాతబస్తీలోని కాలాపత్తర్లో అలీ అనే ఓ ఇంటి యజమాని తన ఇంట్లో అద్దెకు నివాసముంటున్న బాలికపై అదును చూసి, హత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పి, బోరున విలపించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టారు.