అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీచేస్తా.

అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరిలో పోటీ చేస్తానాని బిజెపి ఓబీసి మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ అన్నారు.శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని కృపా కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లెల రవి యాదవ్ మాట్లాడుతూ.రానున్న సార్వత్రిక  ఎన్నికలలో బిజెపి పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నియోజకవర్గం అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని,అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన గెలిపించుకుంటామని అన్నారు. రానున్న రోజులలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను మల్కాజిగిరి నియోజకవర్గంలోని గడపగడపకు తీసుకువెళ్తామని,. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎండగడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తార అన్నాను. మల్కాజిగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో బిజెపిని గెలిపించి తమ సత్తా చూపుతానన్నారు.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.