అనుముల మండలంలో దొంగల బీభత్సం

నల్గొండ, ఆగస్టు 16: జిల్లాలోని అనుముల మండలంలో దొంగల బీభత్సం సృష్టించారు. మండలంలోని నాయుడుపాలెం, పేరూరు, అంజనేయతండాలోని ఆలయాల్లోకి చొరబడి రూ.3 లక్షల విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.