అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

కరీంనగర్‌,నవంబర్‌27 (జనంసాక్షి )  : అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరీంనగర్‌లోని అశోక్‌ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అశోక్‌ నగర్‌లో నివాసముంటున్న స్వర్ణకారులు గట్టు ముక్కుల సతీష్‌ (32), అతని భార్య తనూజ(27)లు నేటి ఉదయం సైనైడ్‌ మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తలిద్దరూ ఉదయం 8 గంటల వరకు నిద్ర లేకపోవడంతో సతీష్‌ తల్లికి అనుమానం వచ్చింది. ఆమె వెళ్లి చూసేసరికి అప్పటికే సతీష్‌ దంపతులిద్దరూ మృతి చెందారు. సతీష్‌ తండ్రి దక్షిణామూర్తి కూడా ఇదే విధంగా 10 సంవత్సరాల కిందట సైనైడ్‌ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు సతీష్‌కు ఇద్దరు సోదరులు ఉన్నారు. వారికి ఇంకా వివాహం కాలేదు.