అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి ఘట్‌కేసర్‌ మండలం సాయినగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక దంపతులు రాజేంద్రప్రసాద్(40), అన్నపూర్ణ(32) ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతితో కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.