అప్పుల బాధతో మరో రైతన్న ఆత్మహత్య

నల్గొండ: నారాయణపురం మండలం దేవిరెడ్డిబంగ్లాలో అప్పుల బాధతో రైతు గోదాటి శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ స్వస్థలం చండూరు మండలం కొండాపూర్ గా గుర్తించారు. భూమిని కౌలుకు తీసుకొని శంకర్ దేవిరేడ్డిబంగ్లాలో వ్యవసాయం చేస్తున్నాడు. దీంతో అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో శంకర్ కుటుంబం రోడ్డున పడింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.