అభివృద్దిలో జిల్లాను మరింత ముందుంచలా

అందుకు టిఆర్‌ఎస్‌ గెలుపు అత్యావశ్యకం

గులాబీ నేతల గెలుపుతోనే ఉమ్మడి జిల్లాకు మహర్దశ

ప్రచారంలో ఎంపి పొంగులేటి సూచన

ఖమ్మం,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అభివృద్ధి పథంలో జిల్లా మరింత ముందుకు సాగాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల పక్షాన పనిచేస్తున్న వారినే గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ కూటమిని గెలిపిస్తే మరింత వెనకబడి పోతామని ఆయన తన ప్రచారంలో హెచ్చరించారు. ప్రజాసేవలో అంకితమైన నాయకుడిగా సిఎం కెసిఆర్‌ను ప్రతిఒక్కరు గుర్తించారన్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉన్నవారినే ఎమ్మెల్యేలుగా మరోసారి గెలిపించడం వల్ల లాభం ఉంటుందన్నారు. కష్టపడి పనిచేస్తే టీఆర్‌ఎస్‌దే గెలుపని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలుపరిచి పలురాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తయితే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు ఒక ఎత్తన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను కంటికి రెప్పలా ఎటువంటి అవసరాలైన తీర్చుకునేందుకు మేముందుంటామని హావిూ ఇచ్చారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అభివృద్ధి మంత్రమే టీఆర్‌ఎస్‌ మార్గమన్నారు. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అభివృద్ధిని చూసి పార్టీలోకి వలసలు పెరగుతున్నాయన్నారు. అభిమానంతో వచ్చి పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటామన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆశీర్వదించాలని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.