అమెరికాలో జీవీఎల్‌కు హోదా సెగ

– ఏపీని భాజపా మోసం చేసిందంటూ ప్రవాసాంధ్రుల నిరసన
అమెరికా, మే17(జ‌నం సాక్షి ) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కల్పించాలంటూ ఉద్యమం కొనసాగుతున్న వేళ భాజపా ఎంపీలు ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజల నుంచి నిరసన సెగ తప్పడంలేదు. తాజాగా అమెరికా న్యూజెర్సీలో పర్యటిస్తున్న భాజపా రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావుకు ప్రవాసాంధ్రుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. కర్ణాటక విజయాన్ని పురస్కరించుకుని ఎన్నారై భాజపా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న నర్సింహారావుపై ప్రవాసాంధ్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేక ¬దా ఇస్తామని నమ్మించి ఇప్పుడు మోసం చేశారంటూ మండిపడ్డారు. ¬దాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని జీవీఎల్‌ చెప్పగా.. తెలుగువారు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ¬దా అంటూ మోదీనే ప్రకటనలు చేశారని..
ఇప్పుడు ఇలా మాట మారుస్తారా? నిలదీశారు. ఈ క్రమంలో భాజపా సానుభూతిపరులు, ప్రవాసాంధ్రుల పోటాపోటీ నినాదాలతో సభా ప్రాంగణం ¬రెత్తింది.