అమెరికాలో నల్గొండ యువకుడు మృతి

నల్గొండ: అమెరికాలో నల్గొండ యువకుడు మృతిచెందాడు. అమెరికా ఎల్లికాట్ సిటీలో ఈ నెల 19 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెంకు చెందిన మండలి శేఖర్(28) దుర్మరణం చెందాడు. కాగా రెండేళ్ల క్రితం శేకర్‌ ఉద్యోగ నిమిత్తం అమెరికా వెశ్లాడు. కొడుకు మరణ వార్తను ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.