అర్ధరాత్రి వృద్ధ దంపతులు దారుణ హత్య

 మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అంబయ్య(75), సుశీలమ్మ(70) దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడు సత్తయ్య గ్రామంలోనే కొత్త ఇంటిని నిర్మించుకుని అందులో ఉండగా.. అంబయ్య దంపతులు పాత ఇంట్లోనే ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దంపతులను దారుణంగా హత్య చేసి ఇంట్లో ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.