అవినీతిలో కెసిఆర్‌ సర్కార్‌: నాగం

నాగర్‌ కర్నూల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): రాష్ట్రంలో అవినీతి పెచ్చువిూరిందని కాంగ్రెస్‌ నేత నాగం జనార్థన్‌ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతి అంతం కోసం ఉమామహేశ్వరం క్షేత్రం నుంచి యాత్ర చేపడతామని నాగం ప్రకటించారు. శనివారం విూడియాతో మాట్లాడిన నాగం జనార్థన్‌ రెడ్డి.. తమిళనాట శశికళకు పట్టిన గతే తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబానికి పడుతుందని వ్యాఖ్యానించారు. హరీశ్‌ రావు నిర్వాకం వల్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిద్రపోతోందని విమర్శించారు.ఈపీసీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు.