అహ్మద్ మృతిపై చాలా అంశాలు గోప్యంగా ఉంచారు : కాంగ్రెస్

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లోనే గుండెపోటు వచ్చిన చనిపోయిన లోక్ సభ సభ్యుడు ఈ. అహ్మద్ మృతిపై అనేక అంశాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బడ్జెట్ కోసం అహ్మద్ మృతిని రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ విమర్శించింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కేరళ ఎంపీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. అహ్మద్ మృతిపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది.