ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): పంజాగుట్ట మోడల్ హౌస్ వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీల సాయంతో తొలగించారు. మోడల్ హౌస్ నుంచి ప్రారంభం అయిన ఈ కూల్చివేతలు పంజాగుట్ట రహదారులకు ఇరువైపులా కొనసాగాయి. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో రహదారి ఇరుకు కావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల వరుసగా నగరంలో పుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు చేపట్టారు.