ఆగని రైతుల ఆత్మహత్యలు

sl5xhcfwహైదరాబాద్‌, తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగటం లేదు. సోమవారం వివిధ జిల్లాల్లో మరో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌లో అప్పుల బాధతో మహిళా రైతు లక్ష్మీ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాల మండలం ఉద్దండాపురంలో అప్పుల బాధతో మహిళా రైతు జయంతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం భూషణ్‌పల్లిలో అప్పుల బాధతో రైతు పాండయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తునికినూతల తండాలో అప్పుల బాధ భరించలేక రైతు బిక్షం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ఆయా గ్రామాల్లో విషాదం అలుముకుంది. వరుసగా సాగుతున్న అన్నదాతల ఆత్మహత ్యలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. తెలంగాణ సర్కారు జోక్యం చేసుకొని అన్నదాతల ఆత్మహత్యను ఆపటానికి సత్వరం చర్యలు తీసుకోవాలని విపక్షాల నేతలు డిమాండు చేస్తున్నా