ఆగిన వివాహం…వరుడు, వధువు మాయం

జమ్మికుంట :కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మల్యాల గ్రామంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల చొరవతో శుక్రవారం ఓ బాల్య వివాహం ఆగిపోయింది. కానీ, మండపం నుంచి వధువు, వరుడు అదృశ్యమవడం సంచలనం సృష్టించింది.గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు లకా్ష్మజీపల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడితో శుక్రవారం ఉదయం 11.45 నిమిషాలకు మల్యాల గ్రామంలో పెళ్లి జరగాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు 11 గంటలకు పెళ్లి మండపానికి చేరుకున్నారు. 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయరాదని బాలిక తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే సమయంలో మండపం నుంచి వధువు, వరుడు కనిపించకుండా పోయారు.