ఆటోబోల్తా: పదిమంది కూలీలకు గాయాలు

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  నర్సంపేట మండలం సీతారాం తండా వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. ట్రాక్టర్‌ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. నర్సంపేట ద్వారకాపేట నుంచి దాసరిపల్లెలో వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.