ఆదిలాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారమ్

ఆదిలాబాద్: కేంద్ర ఎరువులు, రసాయన శాఖల మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ బుధవారం ఉదయం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్మల్ పట్టణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆ పార్టీ బహిరంగ సభ లో పాల్గొనేందుకు వచ్చినట్లుసమాచారం. ఆదిలాబాద్ చేరుకున్న ఆయనకు బీజేపీ జిల్లా నేతలు చాంద్‌టీ వద్ద ఘనస్వాగతం పలికారు.