ఆపరేషన్ చేశారు.. దూది మరిచారు

ఆదిలాబాద్ క్రైం: ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కడుపులో వైద్యులు కాటన్ వదిలేసి అలాగే కుట్లు వేసి పంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఉక్తాపూర్ కాలనీకి చెందిన కళ్యాణి(24) పురుటి నొప్పులతో గత శనివారం ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆమెకు అపరేషన్ చేసి మృత శిశువును తీశారు. దీంతో శోక సంద్రంలో మునిగిన ఆమె ఇంటికి వెళ్లింది.

అయితే ఆమెకు రెండు రోజులుగా తిరిగి కడుపు నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం మంగళవారం ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయగా కడుపులో దూది ఉన్న విషయం బయటపడంది. దీంతో ఆమెకు తిరిగి ఆపరేషన్ చేసి దూదిని బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన బాధితులరాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.