ఆయిల్ ధరల పెంపుకు నిరసనగా వామపక్షాల ఆందోళన…

వరంగల్:పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా హన్మకొండ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక ధరల భారం మోపుతోందని, దీంతో సామన్యుల నడ్డి విరుగుతోందని వారు ఆరోపించారు.