ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన షబ్బీర్ అలీ, వంశీచందర్ రెడ్డి

నిజామాబాద్, మే 12:  కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికుల న్యాయబద్దమైన కోర్కెలను తీర్చాలని వారు డిమాండ్ చేశారు.