ఆర్టీసీ బస్సులో మంటలు: తప్పిన ప్రమాదం

మేడ్చల్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  బోధన్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న టీఎస్‌ ఆర్టీసీకి చెందిన బస్సులో పొగలు వచ్చాయి. వెంటనే గమనించిన బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై ఆర్పివేయడంతో పెనుప్రమాదం
తప్పింది. బస్సు మేడ్చల్‌ సవిూపంలోని ఐటీఐ వద్దకు రాగానే బ్రేక్‌ లైనర్లు పట్టేయడంతో టైర్ల వద్ద మంటలు, పొగలు వచ్చాయి. దీంతో బస్సు డ్రైవర్‌ రాజు అప్రమత్తమై బస్సును ఒక పక్కకు ఆపి ప్రయాణికులను దింపేశారు. పక్కనే ఉన్న ¬టల్‌ నుంచి నీరు తీసుకొచ్చి మంటలను ఆర్పివేశారు. డ్రైవర్‌ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47మంది ప్రయాణికులు ఉన్నారు.