ఆర్టీసీ బస్సు బోల్తా:10 మందికిగాయాలు

మహబూబ్ నగర్: జిల్లాలో అడ్డాకుల మండలం హైవే సమీపంలో కొమ్మిరెడ్డిపల్లి దగ్గ సోమవారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.