ఆర్థిక ఇబ్బందులతో 

వృద్ధ దంపతుల ఆత్మహత్య
కరీంనగర్‌,మే17(జ‌నం సాక్షి ):కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామంలో గురువారం తెల్లవారు జామున వృద్ధ దంపతులు పురుగల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మీ నర్సమ్మ(65), ఆమె భర్త కస్తూరి వెంకట నర్సు(80) ఇరువురు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా స్థానికులు తెలిపారు. వీరి కుమార్తెకు 20ఏళ్ల క్రితమే వివాహం జరిపారు. వెంకట నర్సు గతంలో వడ్రంగి పనిచేసేవాడు. వయసు పైబడిన తర్వాత పని పనేశాడు.వృద్ధాప్యంలో ఆదుకునే వారు లేకపోవటంతో కలత చెందిన వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.