ఆర్ధిక సహాయం అందజేసిన— కల్లూరి 

తుర్కపల్లి :  సెప్టెంబర్ 17 (జనంసాక్షి)
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని తుర్కపల్లి గ్రామంలో,ఎం డి శానుర్, మృతిచెందగా, మృతుడికి ఒక్క కూతురు ఒక కొడుకు చిన్నపిల్లలు కావడంతో మరియు నిరుపేద కుటుంబం కావటంతో గ్రామ టి పి యస్  సభ్యులు  విషయాన్ని తెలంగాణ పరిరక్షణ సమితి కన్వీనర్ కల్లూరి రామచంద్రారెడ్డి గారికి తెలియజేశారు.*విషయాన్ని తెలుసుకున్న రామన్న తక్షిన సహాయంగా 5000 రూపాయలు టి పి యస్  సభ్యుల ద్వారా మృతుడి భార్యకి ఆర్థిక సహాయం  అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కల్లూరి రామన్న చేస్తున్న సేవలకు ఆపదలో ఉన్నవారిని ఆధుకుంటున్నందుకు, చనిపోయిన పేద కుటుంబంకి అంత్యక్రియలకు తక్షినసహాయం చేస్తున్నందుకు టి పి యస్  సభ్యులను అభినందించి, కల్లూరి రామన్నకీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టి పి యస్  సభ్యులు మడిగే వెంకటస్వామి, గడ్డమీది యాదగిరి, ఆకుల సిద్దు,బొల్లారం రంజిత్,ఆకుల శేఖర్,అధిములం భాస్కర్,బండారు శ్రీను,సలీమ్,జహంగీర్,యూసుబ్, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.