ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందించిన ఎమ్మెల్యే

 

జనం సాక్షి:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్ఒ దామోదర్ ఆధ్వర్యంలో 42 మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను ఎమ్యెల్యే అంజయ్య యాదవ్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా టెక్నాలజీ చాలా పెరిగి పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ముఖ్యంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆసుపత్రులను అప్ గ్రేడ్ చేస్తుందని, ఆశ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆశా కార్యకర్తలకు పనిభారం తగ్గించేందుకు స్మార్ట్ ఫోన్లను రాష్ట్రవ్యాప్తంగా అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎం పి టి సి జెడ్ పి టి సి నాయకులు తదితరులు పాల్గొన్నారు