ఆసీస్‌ గడ్డపై భారత్‌కి వైట్‌వాష్‌ తప్పదు


– ఆసిస్‌ మాజీ బౌలర్‌ మెక్‌గ్రాత్‌
బ్రిస్బేన్‌, నవంబర్‌19(జ‌నంసాక్షి) : ఆస్టేల్రియా స్టార్‌ క్రికెటర్లు స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు ప్రస్తుతం జట్టులో లేకపోయినా.. ఆసీస్‌ పర్యటనలో భారత్‌ జట్టుకి క్లీన్‌స్వీప్‌ తప్పదని ఆ దేశ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ మెక్‌గ్రాత్‌ అభిప్రాయపడ్డాడు. ఈనెల 21 నుంచి టీమిండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని కంగారూలతో ఆడనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అక్కడికే చేరుకున్న భారత్‌ జట్టు.. బ్రిస్బేన్‌ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తోంది. బాల్‌ టాంపరింగ్‌ కారణంగా స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై ఏడాది నిషేధం వేటు పడగా.. భారత్‌తో పోలిస్తే ఇప్పుడు ఆస్టేల్రియా టీమ్‌ బలహీనంగా కనిపిస్తోంది. కానీ.. నాలుగు టెస్టుల సిరీస్‌ని 4-0తో గెలుచుకోగల సత్తా ఆస్టేల్రియాకి ఉందని మెక్‌గ్రాత్‌ చెప్పుకొచ్చాడు. ఆస్టేల్రియా జట్టులో స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ స్థానాలు భర్తీ చేయడం చాలా కష్టం. కానీ.. యువ క్రికెటర్లకి ఇదే మంచి అవకాశం. భారత్‌పై సిరీస్‌లో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లక  ఇక ఆస్టేల్రియా జట్టులో తిరుగుండదన్నారు. రెండు అగశ్రేణి జట్ల మధ్య పోటీ కావడంతో సిరీస్‌ ఆసక్తికరంగా జరగనుందని, అయితే.. టెస్టు సిరీస్‌ని 4-0తో చేజిక్కించుకోగల సత్తా ప్రస్తుత ఆస్టేల్రియా జట్టుకి ఉందని మెక్‌గ్రాత్‌ ధీమా వ్యక్తం చేశాడు. సుదీర్ఘకాలంగా ఆస్టేల్రియాలో పర్యటనిస్తున్న భారత్‌ జట్టు ఇప్పటి వరకూ కనీసం ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా ఆ గడ్డపై గెలవలేకపోయిందన్నారు. దీంతో.. కనీసం ఈ పర్యటనలోనైనా సిరీస్‌ గెలవాలని భారత్‌ పట్టుదలతో ఉందన్నారు.