ఆస్తులు తాకట్టు పెట్టి విద్యానికేతన్‌ నడుపుతున్నాం: మోహన్‌ బాబు

చిత్తూరు,జనవరి23(జ‌నంసాక్షి): తమకున్న ఆస్తులను తాకట్టు పెట్టి.. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థలను నడిపిస్తున్నట్లు సినీ నటుడు మోహన్‌ బాబు పేర్కొన్నారు. బుధవారం మోహన్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ… ఒక నెల సంస్థ నిర్వహణకు రూ.6 కోట్లు అవసరమని, గత రెండేళ్లుగా ఎపి ప్రభుత్వం నుండి రూ.20 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వ బకాయిలు పెండింగ్‌లో ఉన్నా.. నమ్ముకున్న సిద్ధాంతాలకు లోబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు.