ఇంటింటా యజ్ఞం చేస్తే మంచిది

నిజామబాద్‌,మార్చి2 (జ‌నంసాక్షి): ఇంటింటా యజ్ఞం చేయాలని ఇందూరు యజ్ఞసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మూడనాగభూషణం గుప్త అన్నారు. ఇది ఎంతో మంచిదని, యజ్ఞం చేసిన ప్రతిఇంటా సకల శుభాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. తాను నిజామాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లోని చాలా ఇళ్లలో యజ్ఞం నిర్వహిస్తున్నానని ఆయ న పేర్కొన్నారు.  ఇప్పటికి 304 మంది ఇళ్లలో పురోహితుల ద్వారా యజ్ఞం  నిర్వహించామని పేర్కొన్నారు. యజ్ఞం నిర్వహించడం వల్ల చాలా కుటుంబాలు సుఖసంతోషలతో విలసిల్లుతున్నాయన్నారు.