ఇంటింటికి నీరందించే హావిూని నిలబెట్టుకుంటాం: ప్రశాంత్‌ రెడ్డి

నిజామాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్‌ భగీరథ శరవేగంగా సాగుతోందని మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి అననారు. నీళ్లివ్వకుంటే ఓట్లడగమన్న హావిూకి కట్టుబడి ఉన్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెరాసదే గెలుపు అని పేర్కొన్నారు. అందుకే వివిధ పార్టీల నుంచి వచయ్చిన వారు టిఆర్‌ఎస్‌లో చేరి నమ్ముతు న్నారని అన్నారు. తనను నమ్మి తెరాసలో చేరిన నాయకులు, కార్యకర్తలు పాత, కొత్త తేడా లేకుండా పనిచేయాలని కోరారు. అందరికి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇదిలావుంటే పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ హయాంలో గతపతతదే/రిళిగ జిల్లాకు ఏంచేశారని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తూ పరిశ్రమల స్థాపన కోసం ప్రయత్నిస్తున్న ఎంపీ కవిత పతంజలి గ్రూపుతో చర్చించారని అన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు 5 రాష్టాల్ర ముఖ్య మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి ముమ్మర ప్రయత్నం చేస్తున్న తీరును హర్షించారు. చక్కర కార్మగారం గురించి మాట్లాడుతున్నారని, మరి అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వే లైనుకు నిధులు తీసుకురావడానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఎంపీ కవిత గెలిచిన కొన్ని రోజుల్లోనే కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి లైను పనులు పూర్తి చేసేందుకు అవసరమైన రూ.250 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే జిల్లాలోని యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.