ఇంటికి చేరుకున్న లతా మంగేష్కర్‌

ముంబై,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తీవ్ర అస్వస్థతతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ సీనియర్‌ గాయని లతామంగేష్కర్‌ 28 రోజుల తర్వాత ఇల్లు చేరారు. భారతరత్న అవార్డు గ్రహీత అయిన 90 ఏళ్ల లత ఆదివారం మాట్లాడుతూ.. తనకు న్యూమోనియా ఉన్నట్టు వైద్యులు నిర్దారించినట్టు తెలిపారు. 28 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి చేరుకున్నట్టు పేర్కొన్నారు. తానిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన క్షేమాన్ని కాంక్షించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.