ఇంటి పన్ను వసూలుకు స్పెషల్ డ్రైవ్ ఎంపీవో మహబూబ్

 

 

 

 

 

 

 

బిచ్కుంద ఫిభ్రవరి 04 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల దౌల్తపుర్ గ్రామము నందు శనివారం నాడు పన్ను వసూలు చేయడం జరిగిందని మండల ఎంపీవో మహబూబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌల్తపూర్ గ్రామములో స్పెషల్ డ్రైవ్ లో 100 శాతం పన్ను వసూలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆయనతో పాటు పంచాయతీ కార్యదర్శి కర్క సంజు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.