ఇక పెట్రోల్ డోర్ డెలివరీ!?
పెట్రోల్ బంకుల్లో క్యూలకు స్వస్తి చేప్పేందుకు వినూత్న ఆలోచన చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇకపై పెట్రో ఉత్పత్తులను కూడా డోర్ డెలివరీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ సౌకర్యం కల్పించే యోచన చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రతి రోజూ దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది పెట్రోల్ స్టేషన్లకు వస్తున్నారు. ప్రతి ఏడాది 25 వేల కోట్ల లావాదేవీలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డోర్ డెలివరీ ఆలోచనపై కసరత్తు చేస్తోంది కేంద్రం.