ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలు అరెస్ట్‌

మేడ్చల్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : మేడ్చరల్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అంతర్‌ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఉమామహేశ్వర్‌రావు, యాదమ్మ.. తెలంగాణ, ఆంధప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో సుమారు 150 చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 30 తులాల బంగారం, 1.4 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.