ఇద్దరు జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు

మయన్మార్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): రోహింగ్యాల గురించి కథనాలను రాసిన ఇద్దరు రాయటర్స్‌ జర్నలిస్టులకు మయన్మార్‌ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. గత ఏడాది నుంచి రాఖైన్‌ రాష్ట్రంలో జరుగుతున్న రోహింగ్యాల ఊచకోత గురించి జర్నలిస్టులు వా లోన్‌, క్వా సూ ఓలు తమ కథనాల ద్వారా అనేక సంఘటనలను వెలికి తీశారు. అయితే అక్రమంగా ప్రభుత్వ డాక్యుమెంట్లు కలిగి ఉన్న కేసులో.. ఆ ఇద్దరికీ ప్రస్తుతం జైలు శిక్షను ఖరారు చేశారు. బ్రిటీష్‌ కాలం నాటి అఫిషియల్‌ సీక్రెట్స్‌ యాక్ట్‌ను ఉల్లంఘించారని ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తమను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని ఆ ఇద్దరూ ఆరోపిస్తున్నారు.