ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్మ

suicideమహబూబ్‌నగర్‌ జిల్లాలోని నవాబ్‌పేట మండలం కొండాపూర్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే యశోద తన ఇద్దరు పిల్లలు భాగ్య, ఆంజనేయులతో కలిసి ఈ అఘాయిత్యంకు పాల్పడింది . కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమంటున్నారు స్థానికులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.