ఇరాన్‌లో భూకంపం..ఐదుగురు మృతి

టెహ్రాన్‌,నవంబర్‌ 8 (జనం సాక్షి) : ఇరాన్‌లో భూకంపం సంభవించింది. వాయువ్య ఇరాన్‌లో 5.9 తీవ్రతతో భూప్రకంపనలు నమోదవగా..ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌కు సవిూపంలో 2 కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం అధీకృతమైందని యూఎస్‌ జియాలాజికల్‌ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. 2003లో ఇరాన్‌లోని బామ్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించగా..26వేల మంది మృతి చెందారు.