ఇళ్ల పట్టాల కోసం సిపిఎం ధర్నా

విజయవాడ,జూన్‌14(జ‌నం సాక్షి): పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, రిజిస్టేష్రన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు.. కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సిపిఎం మహాధర్నా చేపట్టింది. పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తానన్న ప్రభుత్వం నాలుగేళ్లయినా ఆ దిశగా పనులను చేయటంలేదని విమర్శిస్తు సీపీఎం పార్టీ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టింది. పేదలు అ/-దదె కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం చేపట్టిన ఈ ధర్నాకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.